గుణత్రయవిభాగయోగ - శ్లోకం శ్లోక 22, 23, 24, 25
శ్లోక 22, 23, 24, 25
శ్రీభగవానువాచ |
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాణ్డవ |
న ద్వేష్టి సమ్ప్రవృత్తాని న నివృత్తాని కాఙ్క్షతి ||౧౪-౨౨||
ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే |
గుణా వర్తన్త ఇత్యేవం యోఽవతిష్ఠతి నేఙ్గతే ||౧౪-౨౩||
సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాఞ్చనః |
తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిన్దాత్మసంస్తుతిః ||౧౪-౨౪||
మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః |
సర్వారమ్భపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ||౧౪-౨౫||
అనువాదం
శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా, ఈ త్రిగుణములకు అతీతులైనవారు - (సత్త్వ గుణ జనితమైన) ప్రకాశమును కానీ, (రజో గుణ జనితమైన) కార్యకలాపములను కానీ, లేదా (తమో గుణ జనితమైన) మోహభ్రాంతిని కానీ - అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా, అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా, ఉదాసీనంగా ఉండి, వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుని వారు నిశ్చలముగా ఆత్మ యందే స్థితమై ఉంటారు. సుఖదుఃఖాలలో ఒక్క రీతిగానే ఉండేవారు; ఆత్మ భావన యందే స్థితమై ఉండేవారు; మట్టిముద్ద, రాయి, మరియు బంగారము వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారు; అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్కరీతిగానే ఉండేవారు; తెలివైన వారు; నిందాస్తుతులను రెంటినీ సమముగా స్వీకరించేవారు; గౌరవమును, అవమానమును ఒక్క రీతిగానే తీసుకునేవారు; శత్రువుని, మిత్రుడిని ఒకలాగే చూసేవారు; అన్ని యత్నములను విడిచిపెట్టినవారు - వీరు త్రిగుణములకు అతీతులైనవారు అని చెప్పబడుతారు.